ఐపీఎల్ 2020 : హ్యాట్రిక్‌పై రాజస్థాన్ కన్ను - విజయమే లక్ష్యంగా కేకేఆర్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:44 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇపుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. ముఖ్యంగా, పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించి పెను ప్రకంపనలు సృష్టించిన రాజస్థాన్ ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌పై గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా కూడా విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే మెరికల్లాంటి క్రికెటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 
 
ప్రధానంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, కెప్టెన్ స్టీవ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఈ త్రయం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. దీంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించింది. 
 
శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. అతన్ని కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు శక్తికిమించిన పనిగా తయారైంది. ఇక స్మిత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. తెవాటియా కూడా జోరుమీదుండటం రాజస్థాన్‌కు ఊరటనిచ్చే విషయం. 
 
ఇక కోల్‌కతా జట్టులో శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. మోర్గాన్ కూడా గాడిలో పడటం కోల్‌కతా కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. దీంతో కోల్‌కతా కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
కాగా, ఈ ఇరు జట్లూ ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 20 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లూ పదేసి సార్లు గెలుపొందాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుది. పాయింట్ల పట్టికల్ రాజస్థాన్ (పాయింట్లు 4) అగ్రస్థానంలో ఉంటే.. కేకేఆర్ (పాయింట్లు 2) జట్టు ఏడో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments