Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:10 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల రూపాయల అపరాధం విధించారు. దీనికి కారణం స్లో ఓవర్ రేట్. ఐపీఎల్ టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో 11వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్ ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. 
 
దీనికితోడు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ.12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న రెండో జట్టు జట్టు ఢిల్లీనే. ఇటీవల బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే తరహా అపరాధం విధించిన విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments