Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు కంటే కుటుంబమే గొప్పది.. రూ.12.50 కోట్లు వదులుకున్న సురేశ్ రైనా!!(video)

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:39 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా. ఐపీఎల్ 2020 కోసం ఇటీవల జట్టుతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. జట్టుతో కలిసి రెండు రోజుల పాటు హోటల్‌లో ఉన్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ.. హుటాహుటిన స్వదేశానికి తిరిగివచ్చాడు. దీనిపై అనేక రకాలైన పుకార్లు, ఊహాగానాలు వస్తున్నాయి. జట్టు యాజమాన్యంతో గొడవపడి తిరిగి వచ్చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వీటిని చూసిన సురేష్ రైనా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, తన కుటుంబం కోసం తాను తిరిగొచ్చానని రైనా చెప్పాడు. ఇతరత్రా కారణం ఏదైనా ఉన్నట్టయితే తాను ఇంటికి రాగానే చెప్పి ఉండే వాడినని రైనా తెలిపాడు. 
 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనకు కుటుంబం లాంటిదని.. పైగా మహీ భాయ్(ఎంఎస్ ధోనీ) తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని రైనా చెప్పుకొచ్చాడు. సీఎస్‌కే జట్టుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. 
 
అయినా.. బలమైన కారణం ఏదీ లేకుండా రూ.12.5 కోట్లను వదులుకుని ఎవరూ వెనుదిరగరని రైనా తెలిపాడు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్ అయి ఉండొచ్చు కానీ తాను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మరో నాలుగైదు సీజన్‌లు ఆడతానని సురేష్ రైనా స్పష్టం చేశాడు.
 
కాగా, సురేష్ రానా రావడానికి బలమైన కారణం ఉంది. రైనా మేనత్త కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో మేనమామ ప్రాణాలు కోల్పోగా మేనత్త కూడా చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలియగానే సురేష్ రైనా దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments