Webdunia - Bharat's app for daily news and videos

Install App

గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా..? పగలబడి నవ్వుకున్న క్రికెటర్లు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:11 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సందడి దుబాయ్‌లో మొదలైంది. చెన్నై టీమ్‌లో కరోనా కేసులు బయటపడడంతో కఠిన నియమాల మధ్య ఆటగాళ్ళ గడుపుతున్నారు. రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. అలాగే బయోబుడగ దాటకుండా జియో ట్యాగింగ్‌తో అనుక్షణం వారిని గమనిస్తోంది ఓ టీమ్. తాజాగా ఇలాంటి వాతావరణంలో గడుపుతున్నవారి అనుభవం ఎలా ఉంటుందో ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివరించాడు. 
 
తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. డే బై డే కరోనా పరీక్షలు చేయించుకుంటామని, గది దాటితే జియో ట్యాగింగ్‌ పరికరం ఉండాల్సిందే అన్నారు. ఆటగాళ్ళు దగ్గర దగ్గరగా వెళుతున్నప్పుడు అది మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరంలోని గంట కూడా మోగుతుంది. ప్రస్తుతం అధికారులు ఇంతటి కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ఆటగాడు ప్రశ్న వేశాడు. సర్.. మా భార్యలు కూడా ఇలాంటి పరికరం ధరించాలా అని.. బయో బుడగలో ఉన్న ఎవరైనా సరే దీనిని ధరించాల్సిందేనని అధికారులు తెలిపారు. "అవునా మరి గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా" అంటూ హస్యంగా సమాధానం ఇచ్చాడు. దానికి అక్కడ పగలబడి నవ్వుకున్నాం అంటూ" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments