Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ను వదిలిపెట్టని కరోనా.. బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యునికి కోవిడ్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (16:35 IST)
కరోనా వైరస్ క్రికెట్‌ను వదిలిపెట్టట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ దుబాయ్‌కి మారినప్పటికీ బీసీసీఐని వదలట్లేదు. తొలుత... చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును భయాందోళనలకు గురి చేసిన వైరస్‌... తాజాగా బీసీసీఐని పలకరించింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని ఓ సభ్యునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యునికి కరోనా సోకిన మాట నిజమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేదని బోర్డు చెబుతోంది.
 
ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడని, ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేడని స్పష్టం చేసింది. ఎమిరేట్స్‌కు వెళ్లే సమయంలో కూడా ఆ సభ్యుడు ఇతరత్రా ఏ క్రికెటర్‌తోనూ కాంటాక్ట్‌ కాలేదని బోర్డు వెల్లడించింది.
 
ఐపీఎల్‌ కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లిన తర్వాత మొత్తం పదమూడు మంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ సభ్యులకు కరోనా సోకింది. అయితే రెండు రోజుల కిందట వారందరికీ మరోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో... నెగటివ్‌ రిపోర్ట్ వచ్చింది.
 
దీంతో... సీఎస్‌కే జట్టు కుదుటపడింది. కాగా... తాజాగా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యుడికే కరోనా వచ్చింది. మరోవైపు బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న ఇద్దరు సభ్యులకు కూడా కరోనా సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments