Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-13వ సీజన్.. రైనా సంగతేంటో కానీ.. సీఎస్కే ధోనీపై భారం..

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:25 IST)
ఐపీఎల్ 13వ సీజన్‌కు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సీఎస్కే జట్టుకు కరోనా కాటు తప్పలేదు. ఆగస్టు 21న దుబాయ్‌కి వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంది. అదే సమయంలో ఇద్దరు ఆటగాళ్లు 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆ జట్టులో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే రైనా భారత్‌కు తిరిగి వెళ్లిపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 
 
అతడు కరోనాకు భయపడి వెనుదిరిగాడని, అలాగే హోటల్‌ గది నచ్చక జట్టుతో విభేదాలు వచ్చాయని, మరోవైపు పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో వచ్చాడంటూ అనేక కథనాలు ప్రసారమయ్యాయి.
 
చివరికి సీఎస్కే యజమాని శ్రీనివాసన్‌ కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడనే ఊహాగానాలూ వచ్చాయి. వీటన్నింటిపై స్పందించిన రైనా గురువారం ఓ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండడమే శ్రేయస్కరమని భావించి తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అనేది తెలియాల్సింది.
 
ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ట్విటర్‌లో సీఎస్కేను ఒక ఆసక్తికర ప్రశ్న వేశాడు. ఈసారి మన వైస్‌ కెప్టెన్‌ ఎవరని అడిగాడు. దానికి స్పందించిన ఆ జట్టు అంతే ధీటుగా సమాధానమిచ్చింది. మనకు తెలివైన సారథి ధోనీ ఉండగా ఇక భయమెందుకు? అని తిరిగి ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments