Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రిషబ్ పంత్?!

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (16:40 IST)
భారత యువ క్రికెటర్ అండ్ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్2019 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  తరపున ఆడుతున్నాడు. ఈ క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఓ వీడియో సంచలనం రేపుతున్నది. వికెట్ల వెనుక ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ బిజీగా ఉండే పంత్.. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లోనూ ఇలాగే ఓ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడదే అతడు ఫిక్సింగ్ చేశాడా అన్న అనుమానాలకు తావిస్తున్నది. 
 
కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పంత్.. బంతి పడే ముందే దాని ఫలితాన్ని అంచనా వేశాడు. "యే తో వైసీ భీ చౌకా హై" (ఇదెలాగూ ఫోర్ వెళ్తుంది) అని పంత్ అనడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించింది. అతడు అన్నట్లుగానే సందీప్ లామిచానె వేసిన ఆ తర్వాతి బంతిని కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప బౌండరీకి తరలించాడు. ఇప్పుడీ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ముందుగానే ఫిక్సయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments