మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రిషబ్ పంత్?!

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (16:40 IST)
భారత యువ క్రికెటర్ అండ్ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్2019 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  తరపున ఆడుతున్నాడు. ఈ క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఓ వీడియో సంచలనం రేపుతున్నది. వికెట్ల వెనుక ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ బిజీగా ఉండే పంత్.. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లోనూ ఇలాగే ఓ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడదే అతడు ఫిక్సింగ్ చేశాడా అన్న అనుమానాలకు తావిస్తున్నది. 
 
కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పంత్.. బంతి పడే ముందే దాని ఫలితాన్ని అంచనా వేశాడు. "యే తో వైసీ భీ చౌకా హై" (ఇదెలాగూ ఫోర్ వెళ్తుంది) అని పంత్ అనడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించింది. అతడు అన్నట్లుగానే సందీప్ లామిచానె వేసిన ఆ తర్వాతి బంతిని కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప బౌండరీకి తరలించాడు. ఇప్పుడీ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ముందుగానే ఫిక్సయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

తర్వాతి కథనం
Show comments