మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది.. ధోనీపై 50శాతం మ్యాచ్ ఫీజు కోత..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:29 IST)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు. ధోనీ ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించారు. అవును మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ధోనీకి ఈ సారి కోపం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన లెవల్ 2 నేరం చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్‌కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్‌ను తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. 
 
ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు. 
 
మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. కానీ దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను నిర్వాహకులు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments