Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుంది: వీరేంద్ర సెహ్వాగ్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:10 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. తాజాగా సెహ్వాగ్‌ను కలిసేందుకు ప్రత్యేకమైన అభిమాని మొహాలీ వచ్చాడు. 
 
మైదానంలో జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ పెద్దాయన సెహ్వాగ్ దగ్గరకు వచ్చి పాటియాలా నుంచి వచ్చానని చెప్పాడు. తన పేరు ఓం ప్రకాశ్ (93) అని.. సెహ్వాగ్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. 70 కిలోమీటర్లు ప్రయాణించి సెహ్వాగ్ కోసం వచ్చానని చెప్పడంతో డాషింగ్ ఓపెనర్ షాక్ అయ్యాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు సెహ్వాగ్ నమస్కారం చేశాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుందని.. 93ఏళ్ల వయసులో తనకోసం పాటియాలా నుంచి వచ్చారు. తనపై ఎంతో ప్రేమ కురిపించారని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments