Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి మృతి... ఇపుడు ఆ రికార్డు భారత్ సొంతం...

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:12 IST)
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా రికార్డు సాధించిన ఇరాన్ దేశస్థుడు అమౌ హాజీ ఇకలేరు. 94 యేళ్ళ వయస్సులో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుడా హాయిగా ప్రాణాలు విడిచాడు. దాదాపు 60 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అయితే, ఆయన నివసించే గ్రామ ప్రజలు బలవంతంగా ఇటీవల ఆయనకు స్నానం చేయించారు. ఈ స్నానం చేయించిన కొద్ది రోజులకే ఆయన చనిపోవడం గమనార్హం. 
 
అమౌ హాజీ మృతితో ఇపుడు ఈ రికార్డు భారత్ సొంతమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కైలాశ్ కాలౌ సింగ్ (63) గత 44 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని గత 2009లోనే హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెగ్జా గ్రామంలో మృతి చెందారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. 
 
చనిపోయిన మూగ జీవాల మాంసాన్ని ఆరగిస్తూ జీవిస్తూ వచ్చాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లు ఊదిపడేసేవాడు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడుతామన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులూ ఎన్నడూ కడుక్కోకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments