Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... ప్రియుడిని చంపేసి ముక్కలు చేసి ఉడికించేసింది...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:20 IST)
ఒక మహిళ తన ప్రియుడిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించేసింది. అయితే ఈ సంఘటన మన దేశంలో కాదు దుబాయ్‌లో జరిగింది.
 
మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారితో విడిపోయిన మహిళ పదేళ్ల నుండి దుబాయ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో మొరాకోకే చెందిన 29 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారి వారు సహజీవనం చేసుకునే వరకు వెళ్లింది.
 
ఇటీవలే ఆ వ్యక్తికి ఆ మహిళకు వివాహమైందన్న విషయం తెలిసింది. అప్పటి నుండి తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హఠాత్తుగా ఒక రోజు ఆ మహిళ అతనిని చంపేసి, శవాన్ని ఏమి చెయ్యాలో తెలీక ముక్కలు ముక్కలుగా కోసింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి దుర్వాసన వచ్చి అడుగగా ఎండుచేపలు కొన్నానని, అవి పాడైపోయాయని చెప్పింది. ఆ తర్వాత ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. రెండురోజులు దాటినా కూడా దుర్వాసన తగ్గకపోవడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటిని సోదా చేయగా ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ ఇంటిలో వాసన భరించలేక పోలీసులు చాలా కష్టపడ్డారు. అయితే ఆ మహిళ మాత్రం అక్కడ ఏమీ దుర్వాసన లేనట్లు చాలా సాధారణంగా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments