Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మనిషినే.. భర్త మ*** కోసి కుక్కకు విసిరేసిన భార్య..!

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (14:49 IST)
భర్తను చంపడమే కాకుండా అతని మర్మాంగాన్ని కోసి కుక్కకు వేసిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన ఒబారివ్ అనే గ్రామంలో ఒలెంగ్జాడర్ కుటుంబం వుంది. ఆగస్టు నెల 25వ తేదీ రాత్రి పనిని ముగించుకుని ఇంటికొచ్చి ఒలెగ్జాండర్.. దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో పోలీసులకు షాకిచ్చే.. గగుర్పాటు కలిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన ఒలెగ్జాండర్ భార్య మరియా వద్ద పోలీసులు విచారణ జరిపారు. భర్త కొన్నేళ్ల పాటు తనను చిత్రహింసలకు గురిచేశాడని.. ఆ తంతు ఏమాత్రం తగ్గలేదని.. తానూ మనిషినేనని.. సహనం కోల్పోవడంతో భర్తను చంపేశానని చెప్పుకొచ్చింది. 
 
అందుకే పని ముగించుకుని ఇంటికొచ్చి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి చంపేసానని.. అయినా తన ఆవేశం తగ్గకపోవడంతో అతని మర్మాంగాన్ని కత్తిరించి బయట నిల్చున్న కుక్కలకు విసిరేశానని చెప్పింది. 
 
ఆ సమయంలో చేతిలో రక్తపు మరకలతో కనిపించిన మరియాను తాము చూసినట్లు స్థానికులు తెలిపారు. అంతేగాకుండా ప్రతిరోజూ మరియాను ఆమె భర్త తీవ్రంగా హింసించేవాడని.. దీన్ని కూడా చూశామని స్థానికులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇక ఈ కేసులో మరియా నిందితురాలని తేలితే 15 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం