Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్‌ చీఫ్‌ ఎక్కడ..? పాకిస్తాన్‌ లోనా??

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:51 IST)
తాలిబన్ ప్రధాన నేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడున్నాడనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఇప్పుడు అతడు పాకిస్తాన్‌ ఆర్మీ కస్టడీలో ఉండవచ్చునని చెప్పారు.

అయితే గత ఆరు నెలలుగా అతడిని తాలిబన్‌ సీనియర్‌ నాయకులు, ఆఫ్గాన్‌లో హింసాత్మక చర్యలు చేపడుతున్న తాలిబన్లు కూడా చూడలేదు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్‌ సందర్భంగా వచ్చింది. కాగా, పాకిస్తాన్‌ చెరలో ఉండటంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై భారత్‌ ఆసక్తి కనబరుస్తుంది.

మాజీ తాలిబ్‌ నేత అక్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించి తర్వాత హైబతుల్లా అఖుంద్‌ జాదా తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యారు.

తాలిబన్ల బృందంలో హైబతుల్లా కేవలం సైనికుడే కాకుండా రాజకీయ,మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. అయితే పూర్తిగా ఆఫ్గాన్‌ తాలిబన్ల చేతికి వచ్చాకే ఆయన అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments