Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్ టాక్ స్టార్ పైన 100 మంది మగాళ్లు, దుస్తులు చింపి వీడియో తీస్తూ...

టిక్ టాక్ స్టార్ పైన 100 మంది మగాళ్లు, దుస్తులు చింపి వీడియో తీస్తూ...
, బుధవారం, 18 ఆగస్టు 2021 (17:05 IST)
పాకిస్థాన్ దేశంలో ఇటీవలి కాలంలో ఆటవిక చర్యలు అధికమైపోతున్నాయి. తాజాగా టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై మగాళ్లు తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 400 మంది మగాళ్లు ఈ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి ఆ మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ యువతి వస్త్రాలను చింపేసిన కొందరు కిరాతకులు.. వాటిని గాల్లోకి ఎగురవేసి పైశాచికానందం పొందారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగస్టు 14వ తేదీన పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం. లాహోర్‌లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్‌ యువతిని ఆ అల్లరి మూక హింసించింది.
 
గుమిగూడి ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజారులో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్‌ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌ అయింది. 
 
ఈ ఘటనపై బాధిత యువతి నిన్న లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మినారీ పాకిస్థాన్ వద్ద తన ఆరుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తుండగా.. 400 మంది తనను లైంగికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన చెందింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వాపోయింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి వికృతానందం పొందారని ఆవేదన వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై భ‌యం కాదు... ఆవేద‌న‌!