Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారత చరిత్ర, ప్రణబ్ విడదీయలేనివి: యూఎస్ సెనేట్ ఘన నివాళులు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:29 IST)
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాలలో ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరవలేనిదని యూఎస్ సెనేట్ కొనియాడింది. స్వతంత్ర భారత్ చరిత్రను, ప్రణబ్‌ను విడదీయలేమని, ఇండియాలో జరిగిన అభివృద్ధి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రణబ్‌ను గుర్తు చేసుకున్నారు.
 
భారత ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారని, ప్రణబ్ ముఖర్జీ పేరు తరతరాలు వినిపిస్తుందని సెనేట్ పేర్కొంది. ప్రణబ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో దక్షిణాసియా విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా 84 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
ప్రణబ్ ముఖర్జీ మరణం తనకు బాధ కలిగించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటంలో తన తండ్రి హయాంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని తెలుపుతూ ముఖర్జీ ఓ గొప్ప రాజకీయ యోధుడనీ అభివర్ణించారు. రష్యా ఇండియాల మధ్య స్నేహ బంధం గొప్పగా ఉందంటే అందుకు ప్రణబ్ కూడా కారణమేనని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments