Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారత చరిత్ర, ప్రణబ్ విడదీయలేనివి: యూఎస్ సెనేట్ ఘన నివాళులు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:29 IST)
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాలలో ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరవలేనిదని యూఎస్ సెనేట్ కొనియాడింది. స్వతంత్ర భారత్ చరిత్రను, ప్రణబ్‌ను విడదీయలేమని, ఇండియాలో జరిగిన అభివృద్ధి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రణబ్‌ను గుర్తు చేసుకున్నారు.
 
భారత ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారని, ప్రణబ్ ముఖర్జీ పేరు తరతరాలు వినిపిస్తుందని సెనేట్ పేర్కొంది. ప్రణబ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో దక్షిణాసియా విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా 84 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
ప్రణబ్ ముఖర్జీ మరణం తనకు బాధ కలిగించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటంలో తన తండ్రి హయాంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని తెలుపుతూ ముఖర్జీ ఓ గొప్ప రాజకీయ యోధుడనీ అభివర్ణించారు. రష్యా ఇండియాల మధ్య స్నేహ బంధం గొప్పగా ఉందంటే అందుకు ప్రణబ్ కూడా కారణమేనని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments