Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు...

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (11:48 IST)
డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్.. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో పెనుప్రమాదం తప్పింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో డెన్వర్ నుంచి హోనొలుకు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదివారం తెలిపింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పింది. విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
అయితే, విమాన శకలాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ చిత్రాలను కొలరాడోలోని బ్రూమ్‌ఫీల్డ్‌ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇంజిన్‌ కౌలింగ్‌, టర్ఫ్‌ ఫీల్డ్‌లోని భాగాలు ఉన్నాయి. అలాగే విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో కనిపించింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టేఫీ బోర్డ్‌ (ఎన్‌టీఎస్‌బీ) తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments