Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరుద్యోగులకు శుభవార్త.. 52 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. 52 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
, శుక్రవారం, 22 జనవరి 2021 (14:38 IST)
కరోనా కాలంలోనూ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రముఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. దాదాపు 52 పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయడానికి ఈ నియామకాలను చేపట్టింది. ఫ్రెష్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 
 
టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు మొదట ఆరు నెలలు టెక్నీషియన్ Cగా పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మొదట ఆరు నెలలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు(EAT)గా పని చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారికి నెలకు రూ. 10 వేలు ఉపకార వేతనం చెల్లిస్తారు. అనంతరం వారు పర్మినెంట్ అవుతారు. పర్మినెంట్ అయిన తర్వాత ఇంజనీర్లకు నెలకు రూ. 90 వేలు, టెక్నీషియన్లకు నెలకు రూ. 82 వేల పాటు వేతనం అందించనున్నారు. BEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
అందులో 25 Engineering Assistant Trainees కాగా, మరో 27 Technician C పోస్టులు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల డిప్లొమో కోర్సును ముగించి వుండాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా