ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేనా, ఆయనకు చెందిన రాజకీయ పార్టీపై కూడా

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:23 IST)
అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేనా, ఆయనకు చెందిన రాజకీయ పార్టీపై కూడా నిషేధం విధించింది.
 
అలాగే, జమాత్ ఉద్ దువా ప్రధాన కార్యాలయంతో పాటు 26 ప్రాంతీయ కార్యాలయాల ముందు ఉన్న బారికేడ్లను సోమవారం తొలగించినట్లు పాక్ ప్రకటించింది. యూఎన్ఎస్సీ నిషేధం విధించిన జమాత్ ఉద్ దువా, లష్కరే తోయిబా, అల్‌ఖైదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో పాటు పలు ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద జాబితాలో పాకిస్థాన్ చేర్చింది. 
 
ఈమేరకు 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌పై ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సంతకం చేశారు. దీంతో ఈ విషయాన్ని పాక్ అధికారులు ధృవీకరించారు. హఫీజ్ సయీద్ బ్యాంకు లావాదేవీలను జప్తు చేసినట్లు తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌‌ను అమెరికా గుర్తించి అతనిపై 10 మిలియన్‌ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. పాక్‌ రాజకీయాల్లో హఫీజ్ క్రియాశీలకంగా మారుతున్ననేపథ్యంలో పాకిస్థాన్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments