Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 38 మిలియన్ డాలర్ల బకాయి ఉన్నాం : ఐక్యరాజ్యసమితి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:03 IST)
ఐక్యరాజ్యసమితి ఇండియాకు 38 మిలియన్ డాలర్ల బకాయి పడింది. భారత్‌లో 2019 మార్చి నెల వరకు చేపట్టిన శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన 38 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 
 
అయితే ఐక్యరాజ్యసమితి బకాయిపడ్డ దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో (38 మిలియన్ డాలర్లు) ఉండగా రువాండా (31 మిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (28 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (25 మిలియన్ డాలర్లు), నేపాల్ (23 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెక్రటరీ జనరల్ తన నివేదికలో తెలిపారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి నివేదిక తయారు చేసిన ఆయన, 2019 మార్చి 31 నాటికి ఐక్యరాజ్యసమితి వివిధ దేశాలకు 265 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.
 
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం తమ సైన్యాలు, పోలీసులను పంపి చురుకైన పాత్ర పోషించినందుకు ఆయా దేశాలకు బకాయి పడినట్లు గుటెరెస్ తెలియజేసారు. జూన్ 2019 నాటికి ఇది 588 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యు.ఎన్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments