Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్షత్ర హోటల్స్‌కు బాంబులు చేరవేసిన శ్రీలంక పారిశ్రామికవేత్త కుమారులు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (10:52 IST)
ఈస్టర్ సండే రోజున శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ దర్యాప్తును శ్రీలంక భద్రతా బలగాలు ముమ్మరం చేసింది. ఈ విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మారణహోమానికి పాల్పడిన ఆత్మాహుతి సభ్యుల్లో ఇద్దరు ఆ దేశ పారిశ్రామికవేత్తకు చెందిన ఇద్దరు కుమారులుగా తేలింది. 
 
ఈస్టర్ సండే రోజున కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్ళలో పేలుళ్ళకు పాల్పడిన దుండగుల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారి మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులు ఇమ్సాత్ అహ్మద్ ఇబ్రహీం (33), ఇల్హాం అహ్మద్ ఇబ్రహీం (31) అనే ఇద్దరు ఉన్నట్టు తేలింది. యూసుఫ్ ఇబ్రహీం శ్రీలంకలో మసాల దినుసుల వ్యాపార దిగ్గజంగా ఉన్న విషయంతెల్సిందే. 
 
ఈ ఇద్దరు అన్నదమ్ములు స్టార్ హోటళ్ళలోకి బ్యాగుల్లో బాంబులు చేరవేశారు. ముఖ్యంగా, కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌, షాంగ్రీ లా హోటళ్లలో పేలిన బాంబులు వీరిద్దరూ చేరవేసినట్టు సమాచారం. అయితే, వీరిద్దరూ సజీవంగా ఉన్నారా లేదా అన్నది ఇపుడు తెలియాల్సివుంది. 
 
ఈ దర్యాప్తులో వీరిద్దరి పేర్లు బయటకురాగనే, యూసుఫ్ సహా ఆయన మూడో కుమారుడైన ఇజాస్‌ అహ్మద్‌ ఇబ్రహీం (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్లు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే యూసుఫ్ కుమారులకు సంబంధం ఉందనే విషయం బయటపడి సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments