Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (10:03 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మూల్యాంకనలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా చనిపోయారు. తాజాగా మరో ఇద్దరు అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం సమీపంలోని నాగినేనిపల్లి గ్రామంలో మితి (19) అనే ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్‌‌లోని ఓ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన మితి, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఫెయిలైంది. గత నాలుగైదు రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న మితి, కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం ఉరివేసుకుంది. 
 
మరో ఘటనలో వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు (18) పురుగు మందు తాగింది. మెదక్ జిల్లాలో రాజు అనే విద్యార్థి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తొందరపడి సూసైడ్ యత్నాలు చేయరాదని సీఎం కేసీఆర్ సహా, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు నచ్చజెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments