Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలు

తెలంగాణాలో కొనసాగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలు
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (10:03 IST)
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మూల్యాంకనలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా చనిపోయారు. తాజాగా మరో ఇద్దరు అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం సమీపంలోని నాగినేనిపల్లి గ్రామంలో మితి (19) అనే ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్‌‌లోని ఓ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన మితి, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఫెయిలైంది. గత నాలుగైదు రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న మితి, కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం ఉరివేసుకుంది. 
 
మరో ఘటనలో వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు (18) పురుగు మందు తాగింది. మెదక్ జిల్లాలో రాజు అనే విద్యార్థి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తొందరపడి సూసైడ్ యత్నాలు చేయరాదని సీఎం కేసీఆర్ సహా, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు నచ్చజెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమం సంబంధం.. ప్రియుడితో భర్తను అడ్డంగా నరికేసిన భార్య