Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఘోరం.. కత్తితో వీరంగం.. కనిపించినోళ్లని పొడిచేశాడు..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (11:11 IST)
జపాన్‌లో ఘోరం జరిగింది. కనిపించిన వాళ్లను పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓ దుండగుడు. ఆపై తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద.. మంగళవారం ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో 16మంది గాయాలపాలయ్యారు. 
 
గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వున్నారు. కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో భయంతో రైలు ప్రయాణీకులు పరుగులు తీశారు. అయితే 16మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. 
 
ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 50 ఏళ్ల లోపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారితో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments