Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఏఈలో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలు అమలు

ఠాగూర్
శుక్రవారం, 7 మార్చి 2025 (09:29 IST)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలను అమలు చేశారు. ఇటీవలే భారతీయ మహిళను ఓ కేసులో ముద్దాయిగా తేలించి ఉరితీసిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన వారిని ఉరితీశారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా మృతుల కుటుంబ సభ్యులకు వెల్లడించింది. మృతులను కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్, పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. 
 
ఒక యూఏఈ వాసి హత్య కేసులో మహ్మద్ నివాష్ అరింగిలొట్టు, ఓ భారతీయుడు హత్య కేసులో మురళీధరన్‌ను యూఏఈ కోర్టు దోషిగా తేల్చింది. వీరిద్దరికి యూఏఈ ఉరిశిక్షను అమలు చేసింది. వీరికి అవసరమైన దౌత్య సాయం అదించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. 
 
యూఏఈ జైల్లో ఉన్న భారతీయ మహిళ షెహజాది ఖాన్‌ను ఇటీవల ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెల్సిందే. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి హత్య కేసులో ఆమెకు ఈ శిక్షను విధించారు. షెహజాది ఖాన్ యేడాది పాటు న్యాయపోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గత నెల 15వ తేదీన ఆమెను ఉరితీసి, సమాచారాన్ని విదేశాంగ శాఖ దౌత్యాధికారులకు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments