Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి భార్యను కిందకు తోసేసిన భర్త...

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:47 IST)
టర్కీలో ఓ దారుణం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం తన భార్యను సెల్ఫీ తీసుకుందాంమంటూ కొండ అంచుకు తీసుకెళ్లి, అక్కడ నుంచి కిందికి తోసేశాడు. కేవలం భార్యకు వచ్చే బీమా సొమ్ముకు ఆశపడి ఆ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టక్కీకి చెందిన వ్యక్తికి భార్య ఉంది. ఈమె గర్భందాల్చివుంది. అయితే, ఆమె మరణించాక వచ్చే బీమా సొమ్ము కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. 
 
ఇందులోభాగంగా, సెల్ఫీ తీసుకుందామని చెప్పిన ఆమెను కొండ అంచువరకూ తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఎదురుచూసీ, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆమెను కిందకు తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు పూర్తి సమాచారం సేకరించి కోర్టుకు అందించారు. భార్య తీసుకున్న బీమా పాలసీల్లో నామినీగా భర్త హక్కాన్ పేరు మాత్రమే ఉంది. దీంతో ఆమెను చంపేస్తే బీమా సొమ్ము మొత్తం తనకే వస్తుందన భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. 
 
అయితే.. హక్కాన్ అయాసల్ మాత్రం తాను నిర్దిషి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం సంతకాల కోసమే భార్యకు ఇన్సురెన్సు డాక్యుమెంట్లు ఇచ్చానని, తతిమా వ్యవహారమంతా ఇన్సూరెన్స్ సంస్థ ఏజెంటే చూసుకున్నాడని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments