Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూనీషియాలో 11 మంది చిన్నారుల మృతి... హెల్త్ మినిస్టర్ రిజైన్

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:55 IST)
ఇటీవల బీహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి బారినపడి సుమారుగా వందమందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిలో ఎలాంటి చలనం లేదు. పైగా, అర్థంపర్థంలేని కామెంట్స్. ఫలితంగా బీహార్‌లో ఇప్పటికీ మరణమృదంగం కొనసాగుతోంది. 
 
కానీ, ట్యూనీషియా దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. కేవలం 11 మంది చిన్నారులు చనిపోయినందుకే ఆ దేశ ఆరోగ్య శాఖామంత్రి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అంతేనా, ఈ మరణాలపై విచారణకు సైతం ఆదేశించండం జరిగింది. 
 
ట్యూనీషియా దేశంలోని రబ్టా క్లినిక్‌లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 24 గంటల వ్యవధిలో 11 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ దేశ హెల్త్ మినిస్టర్ అబ్దుల్ రవుఫ్ ఎల్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, చిన్నారుల మృత్యువాతపై ఆరోగ్య శాఖ సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందులో వైద్య సిబ్బంది అలసత్వం కారణంగానే చిన్నారులు చనిపోయారని తేలినపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments