ట్యూనీషియాలో 11 మంది చిన్నారుల మృతి... హెల్త్ మినిస్టర్ రిజైన్

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:55 IST)
ఇటీవల బీహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి బారినపడి సుమారుగా వందమందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిలో ఎలాంటి చలనం లేదు. పైగా, అర్థంపర్థంలేని కామెంట్స్. ఫలితంగా బీహార్‌లో ఇప్పటికీ మరణమృదంగం కొనసాగుతోంది. 
 
కానీ, ట్యూనీషియా దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. కేవలం 11 మంది చిన్నారులు చనిపోయినందుకే ఆ దేశ ఆరోగ్య శాఖామంత్రి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అంతేనా, ఈ మరణాలపై విచారణకు సైతం ఆదేశించండం జరిగింది. 
 
ట్యూనీషియా దేశంలోని రబ్టా క్లినిక్‌లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 24 గంటల వ్యవధిలో 11 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ దేశ హెల్త్ మినిస్టర్ అబ్దుల్ రవుఫ్ ఎల్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, చిన్నారుల మృత్యువాతపై ఆరోగ్య శాఖ సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందులో వైద్య సిబ్బంది అలసత్వం కారణంగానే చిన్నారులు చనిపోయారని తేలినపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments