Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు వైట్‌హౌస్ హెచ్చరిక.. ఉగ్రవాదుల విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా ఆపేసింది. తాజాగా ట

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (15:25 IST)
పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా ఆపేసింది. తాజాగా ట్రంప్ మరో విధంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలనే విషయంలో అన్ని రకాల మార్గాలున్నాయని శ్వేతసౌధం తెలిపింది. 
 
తాలిబన్లు, హక్కనీ నెట్‌వర్క్ ఉగ్రవాదులపై పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోకపోతే ఏం చెయ్యాలో తమకు తెలుసని హెచ్చరించింది. ఆప్ఘనిస్థాన్  సరిహద్దులో ఉగ్రస్థావరాలపై పాక్ దాడులు జరపాలని అమెరికా కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం అధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని, అలా జరిగితే ఇరు దేశాల మధ్య తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. 
 
ఉగ్రవాదుల అంశంపై పాక్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మరోసారి నొక్కి చెప్పారు. అమెరికా పరస్పర సహకారానికే మొగ్గు చూపుతుందని తెలిపారు. ఉగ్రవాదుల విషయంలో అమెరికా ఎంత సీరియస్‌గా ఉందో పాక్ గుర్తించాలని శ్వేతసౌధం అధికారి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments