Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా ఇండో - చైనా లెఫ్టినెంట్ జనరళ్ల భేటీ...

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (08:29 IST)
భారత భూభాగంలో ఇండో - చైనా దేశాలకు చెందిన సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్ళ స్థాయి సమావేశం జరుగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంగా ఈ చర్చలు జరుగనున్నాయి. 
 
ఈ సమావేశం తూర్పు లడఖ్‌లోని అధీనరేఖవెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు మంగళవారం సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. 
 
అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా చైనా సైన్యం గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లింది. 
 
కాగా, గత నెల 15వ తేదీన గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి ప్రవర్తించి భారత బలగాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కానీ, చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రాణనష్టంపై పెదవి విప్పలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చైనా బలగాలు భారత భాభాగాన్ని వదిలి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments