Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా ఇండో - చైనా లెఫ్టినెంట్ జనరళ్ల భేటీ...

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (08:29 IST)
భారత భూభాగంలో ఇండో - చైనా దేశాలకు చెందిన సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్ళ స్థాయి సమావేశం జరుగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంగా ఈ చర్చలు జరుగనున్నాయి. 
 
ఈ సమావేశం తూర్పు లడఖ్‌లోని అధీనరేఖవెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు మంగళవారం సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. 
 
అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా చైనా సైన్యం గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లింది. 
 
కాగా, గత నెల 15వ తేదీన గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి ప్రవర్తించి భారత బలగాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కానీ, చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రాణనష్టంపై పెదవి విప్పలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చైనా బలగాలు భారత భాభాగాన్ని వదిలి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments