పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (12:11 IST)
పాకిస్థాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యూఏఈ) తేరుకోలేని షాకిచ్చింది. పాక్ పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. యూఏఈకి వచ్చిన తర్వాత పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణాలతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి సల్మాన్ చౌదరి స్వయంగా ధ్రువీకరించారు.
 
సెనేట్ మానవ హక్కుల కమిటీ సమావేశంలో సల్మాన్ చౌదరి మాట్లాడుతూ.. యూఏఈ విధించిన ఈ నిషేధాన్ని తొలగించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంపై పాకిస్థానీ పత్రిక 'డాన్' ఒక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా వర్క్ వీసాలపై కాకుండా విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చి చాలామంది పాకిస్థానీయులు భిక్షాటనకు పాల్పడుతున్నారని, అందుకే అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రమోటర్ ఐసమ్ బేగ్ తెలిపారు.
 
గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా దుబాయ్, అబుదాబి పాకిస్థానీ ఉద్యోగార్థులకు ప్రధాన గమ్యస్థానాలు. ఏటా 8 లక్షల మందికి పైగా పాకిస్థానీలు గల్ఫ్ దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. గతేడాది డిసెంబరులో కూడా పాకిస్థాన్‌లోని 30 నగరాల ప్రజలపై యూఏఈ, సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాలు వీసాలపై నిషేధం విధించాయి. స్మగ్లింగ్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, భిక్షాటన కేసులు పెరగడమే ఇందుకు కారణంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments