Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (17:07 IST)
గల్ఫ్ దేశాల్లో ఒకటైన అబుదాబిలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడులు ప్రత్యక్షంగా కాకుండా డ్రోన్ల సాయంతో జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్ల సాయంతో యెమెన్ ఉగ్రవాదులు ఈ దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ ఎయిర్‌పోర్టులోని మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు ఆయిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. అలాగే, కొత్త విమానాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, అబుదాబి పోలీసులు వెల్లడించారు. గత 2019, సెప్టెంబరు నెల 14వ తేదీన సౌదీ అరేబియాలో రెండు కీలక స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments