Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు రాత్రి మాతో గడిపి నీ భర్తను తీసుకెళ్లు... లేదంటే ఖబడ్దార్...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (17:02 IST)
కామాంధులు రకరకాల మార్గాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళ భర్తను కిడ్నాప్ చేసి, తమతో రాత్రంతా గడిపితే భర్తను వదిలేస్తామంటూ ఓ వివాహితను బెదిరించారు కామాంధులు. భర్తను అప్పగించి కోర్కె తీర్చుకోండి అని చెప్పి ఆమె భర్త కోసం పరుగు పరుగున వెళ్లింది... చివరికి ఏమైంది?

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో ఓ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రఘు, తిరుపతి, నాగరాజు అతడి భార్యపై కన్నేసారు. ఎలాగైనా ఆమెను లైంగికంగా అనుభవించాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ఆమె భర్తను కారులో ఎక్కించుకుని పూటుగా కల్లు తాగించారు. అతడు అపస్మారకంలోకి వెళ్లగానే కారులో పడేసి అతడి భార్యకు ఫోన్ చేసారు.

 
తమ కోర్కె తీర్చాలనీ, లేదంటే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు. దానితో ఆమె భయపడిపోయింది. తన భర్తను ఏమీ చేయవద్దనీ, అతడిని తనకు అప్పగించి మీరు కోరినట్లే తీర్చుకోండి అని చెప్పింది. మరోవైపు తన భర్తను కిడ్నాప్ చేసి తనపై అఘాయిత్యం చేస్తామని ముగ్గురు వ్యక్తులు తనను బెదిరిస్తున్నట్లు బంధువులకు సమాచారం ఇచ్చింది మహిళ. ఈలోపు కామాంధులు రమ్మన్న చోటికి వెళ్లింది మహిళ.

 
అక్కడ తన భర్త అపస్మారక స్థితిలో వుండటాన్ని చూసి ఆయన్ను వదిలేయాలంటూ బ్రతిమాలింది. అవేమీ పట్టించుకోని ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారితో ఆమె పెనుగులాడుతుండగా అక్కడికి మహిళ తరపు బంధువులు వచ్చారు. దీనితో అక్కడి నుంచి కామాంధులు ముగ్గురూ పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం