Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యుఎఫ్‌పి)కి 2020 నోబెల్ బహుమతి ప్రదానం

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:42 IST)
ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్‌కి 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ కమిటీ శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిపై పోరులో డబ్ల్యుఎఫ్‌పి అందించిన సహకారం కారణంగా 2020 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుందని నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది.
 
యుద్ధ వివాదాలు, ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలలో శాంతి కోసం సానుకూల వాతావరణం ఏర్పడేందుకు, అలాగే ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు డబ్ల్యుఎఫ్‌పి పెద్దయెత్తున కృషి చేసిందని నోబెల్ కమిటీ తెలిపింది. రోమ్ ఆధారిత ఆహార సంస్థ ప్రతి సంవత్సరం సుమారు 88 దేశాలలో 97 మిలియన్ల మందికి సహాయపడుతుందని తెలిపింది.
 
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రైజ్ మనీ 11 లక్షల డాలర్లు డిసెంబరు 10న ఓస్టోలో జరిగే కార్యక్రమంలో శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments