Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాసకి బకాయిలు మొత్తం చెల్లించాం... భారత్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:18 IST)
ఐక్య రాజ్య సమితి (ఐరాస)కి బకాయిలు మొత్తం చెల్లించిన 35 దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ వెల్లడించారు.
 
ఖజానా ఖాళీ కావడంతో ఐరాస తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘బకాయిలన్నీ కట్టేశాం. మొత్తం 193 దేశాలకు గానూ 35 దేశాలు మాత్రమే ఐరాసకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాయి...’’ అని పేర్కొన్నారు. 
 
భారత్‌తో పాటు ఐరాసకు చెల్లింపులు జరిపిన దేశాల జాబితాను సైతం ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, నార్వే, జర్మనీ, ఇటలీ, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు ఉన్నాయి. కాగా బకాయిలు చెల్లించని దేశాల పేర్లు ఐరాస వెల్లడించే అవకాశం లేదని చెబుతున్నారు. 
 
అయితే అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ తదితర దేశాలు వీటిలో ఉన్నట్టు సమాచారం. దాదాపు 64 దేశాలు ఐరాసకు బాకీ ఉన్నాయి. కాగా చాలా సభ్య దేశాలు చెల్లింపులు జరపక పోవడంతో ఐరాస తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments