Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ పెట్టుకోలేదని ప్రధానికి ఫైన్... ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:21 IST)
thai PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది.
 
మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్‌కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించి ఉండగా ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.
 
ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతడికి జరిమానా విధించారు అధికారులు. ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధానిని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments