Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పుల కలకలం... 20 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:19 IST)
అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు జరిగాయి. టెక్సాస్​లోని ఎల్​పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్​ మాల్​లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాల్పుల శబ్దాలకు మాల్​లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సాయుధులు పెద్ద ఎత్తున విరుచుకుపడి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో స్థానికులు భయాందోళనతో పరుగెడుతున్న వీడియోను కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments