Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:13 IST)
అమర్‌నాథ్ యాత్రకు ముప్పు ఉందని ఐబీ సూచన మేరకే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

న్యూఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకా లేదన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లో 20 మంది విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని మంత్రి చెప్పారు. శనివారం మధ్యాహ్నానికి తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్ధులు ఆదివారానికి ఢిల్లీకి చేరుకొంటారని మంత్రి స్పష్టంచేశారు. 
 
జమ్మూ నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా అస్ట్రేలియాలో పాటు కొన్ని దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తిరిగి రావాలని  కోరింది. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్‌కు వెళ్లకూడదని కూడ జాగ్రత్తలు చెప్పింది. ఇప్పటికే కాశ్మీర్‌లో ఉన్న వారిని తమ దేశానికి రావాలని అత్యవసర సందేశాన్ని పంపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments