Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత - 20 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:57 IST)
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో 18 మంది చిన్నారులు ముగ్గురు పెద్దలతో పాటు ఏకంగా 21 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. 
 
ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 యేళ్ల యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు కూడా ఉన్నారు. 
 
మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డే పట్టణంలోని రోబో ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. 
 
దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 
 
కాగా, పోలీసుల కాల్పుల్లో దండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అమెరికాలో 2018 తర్వాత ఇంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments