Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత - 20 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:57 IST)
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో 18 మంది చిన్నారులు ముగ్గురు పెద్దలతో పాటు ఏకంగా 21 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. 
 
ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 యేళ్ల యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు కూడా ఉన్నారు. 
 
మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డే పట్టణంలోని రోబో ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. 
 
దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 
 
కాగా, పోలీసుల కాల్పుల్లో దండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అమెరికాలో 2018 తర్వాత ఇంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments