Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి.. వారం రోజులుగా..?

సెల్వి
గురువారం, 9 మే 2024 (20:06 IST)
అమెరికాలోని యూనివర్శిటీలో మాస్టర్స్‌ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి చికాగోలో వారం రోజులుగా అదృశ్యమైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ పోస్ట్‌లో, రూపేష్ చంద్ర అనే వ్యక్తి మే 2 నుండి అజ్ఞాతంలో ఉన్నారని తెలిసింది. పోలీసులు.. భారతీయ ప్రవాసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
 
రూపేష్ చంద్ర డిసెంబర్ 2023లో అమెరికా వెళ్లి విస్కాన్సిన్ సిటీలోని కాంకోర్డియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు. చికాగో పోలీసులు కూడా విద్యార్థి గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని నివాసితులను కోరారు. రూపేష్ చంద్ర వరంగల్ జిల్లాకు చెందిన ఆయన ఆచూకీ తెలియక కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
 
అతడిని కనిపెట్టేందుకు సహాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించింది. తన తండ్రి సదానందం తనతో చివరిసారిగా మే 2న వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడానని, తాను ఏదో పనిలో బిజీగా ఉన్నానని రూపేష్ తనకు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు.
 
సదానందం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని సంప్రదించగా, అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ కోసం సహకరించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు రూపేష్ కుటుంబీకులు లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments