Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలిలేని గదుల్లో వుంటున్నారా? కరోనాతో ముప్పు..!

Webdunia
శనివారం, 30 మే 2020 (09:20 IST)
గాలిలేని గదుల్లో వుంటున్నారా? అయితే కరోనాతో ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. 
 
అంతేగాకుండా.. ఈ వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, వైరస్‌ కణాలు మాత్రం ఆ పరిసరాల్లోనే ఉండిపోతాయన్నారు. 
 
అన్ని ప్రాంగణాల్లో ఇప్పుడు ఏసీలు ఉంటున్నప్పటికీ.. వాటి పనితీరు సమర్థంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరించారు. అందుచేత గదులలో గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గాలి ప్రసరణ ద్వారా వైరస్ కణాలను తొలగించుకోవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments