Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు బలైన సెలబ్రిటీల జ్యోతిష్యుడు మృతి... రాజీవ్‌ను చంపేస్తారంటూ...

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (23:09 IST)
దేశంలోనే సెలబ్రిటీల జ్యోతిష్యుడుగా పేరుగాంచిన బేజన్ దారూవాలా ఇకలేరు. ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. దేశంలోని సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. పైగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురవుతారనీ, అలాగే, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని చెప్పారు. అలాంటి జ్యోతిష్యుడు ఇపుడు కన్నుమూశారు. 
 
ఈయన తన జ్యోతిషంతో దేశవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసిన దారూవాలా చివరికి కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటీవలే ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కొన్నిరోజులుగా దారూవాలాకు వైద్యులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
 
ఈయన కేవలం సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పడమే కాదు.. జాతీయస్థాయిలో అనేక పత్రికల్లో ఆస్ట్రాలజీ కాలమిస్టుగానూ కొనసాగారు. 'గణేశా స్పీక్స్' అనే శీర్షికతో ఆయన జ్యోతిష శాస్త్ర విషయాలను పాఠకులతో పంచుకునేవారు. ఆయన మొరార్జీ దేశాయ్, వాజ్ పేయి, నరేంద్ర మోడీ వంటి వారు ప్రధాని అవుతారని ముందుగానే చెప్పారు. అంతేకాదు, రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీ ప్రమాదాలపై ముందుగానే ఉప్పందించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments