Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూడాన్‌లో కూలిన బంగారు గని - 38 మంది మృతి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (08:27 IST)
సూడాన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం సూడాన్ దేశ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
నిజానికి ఈ గనిని సూడాన్ ప్రభుత్వం కొంత కాలం క్రితమే మూసివేసింది. కానీ, ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బంగారం కోసం ఈ గనిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఈ గని కూలిపోవడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దేశంలో తరచుగా బంగారు గనుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు అలాంటి ప్రమాదం మరొకటి సంభవించింది. అయితే, గనుల భద్రత కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలను లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments