Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్‌మెన్ల భద్రతను తిరస్కరించిన వంగవీటి రాధ

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (08:10 IST)
బెజవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాకు ప్రభుత్వం కల్పించిన 2+2 గన్‌మెన్లను ఆయన తిరస్కరించారు. తనకు గన్‌మెన్ల భద్రత అక్కర్లేదనీ, ప్రజల మధ్యలోనే ఉంటానని చెప్పారు. 
 
తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా తన తండ్రి వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు 2+2 చొప్పున గన్‌మెన్లతో భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 
 
దీనిపై వంగవీటి రాధా స్పందించారు. తాను నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తినని, ప్రభుత్వం గన్‌మెన్లు వద్దని చెప్పానని చెప్పారు. తనకు ప్రజలు, అభిమానులే రక్షణ అని స్పష్టంచేశారు. 
 
హత్యకు రెక్కీ నిర్వహించారని తాను వెల్లడించిన తర్వాత అన్ని పార్టీల నేతలు ఫోనులో పరామర్శించారని తెలిపారు. కానీ, ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని చెప్పారు. 
 
అదేసమయంలో తనను పోలీసులు తనను సంప్రదిస్తే పూర్తి సమాచారం అందిస్తానని, పోలీసులకు కూడా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే రెక్కీకి సంబంధించి తన వద్ద కంటే పోలీసుల వద్దే పూర్తి సమాచారం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments