Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

Webdunia
బుధవారం, 20 జులై 2022 (13:15 IST)
శ్రీలంక దేశ కొత్త అధ్యక్షుడుగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో రణిల్ విక్రమసింఘేను కొత్త దేశాధ్యక్షుడుగా ఎన్నికున్నారు. గత 40 యేళ్ళ కాలంలో పార్లమెంట్ ద్వారా లంకాదేశ కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకను వదిలి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దొంగచాటుగా పారిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. 
 
మొత్తం 225 ఓట్ల శ్రీలంక పార్లమెంట్‍‌లో 223 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. వీరిలో రణిల్ విక్రమసింఘేకు 134 మంది మద్దతు తెలుపగా, ఈ పదవి కోసం పోటీపడిన దుల్లాస్‌కు 82, దిసనాయకేకు 3 ఓట్లు చొప్పున పోలయ్యాయి. దీంతో విక్రమసింఘే దేశ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కాగా, రణిల్ విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు విధులు నిర్వహించడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments