Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితులు - ఎమర్జెన్సీ విధింపు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (13:21 IST)
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న లంక దేశం ఇపుడు రావణకాష్టంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. దీంతో ఆందోళనకారులు దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే దేశం విడిచి పారిపోయాడు. 
 
మరోవైపు, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇదే డిమాండ్‌తో శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారిపోవడంతో శ్రీలంక ప్రభుత్వం ఎమెర్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments