Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితులు - ఎమర్జెన్సీ విధింపు

Webdunia
బుధవారం, 13 జులై 2022 (13:21 IST)
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న లంక దేశం ఇపుడు రావణకాష్టంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. దీంతో ఆందోళనకారులు దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే దేశం విడిచి పారిపోయాడు. 
 
మరోవైపు, ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇదే డిమాండ్‌తో శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారిపోవడంతో శ్రీలంక ప్రభుత్వం ఎమెర్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments