Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగిరే విమానంలో వేలాడిన ఇద్దరు మృతి..? కాల్పుల్లో ఐదుగురు బలి

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (18:23 IST)
airport
ఆప్ఘనిస్థాన్ ఎయిర్ పోర్టులో పరిస్థితి దారుణంగా మారింది. విమానం ఎక్కేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. విమానం ఎక్కే క్రమంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో విమానం నుంచి జారిపడుతున్నారు. 
 
తాలిబన్ల ఆక్రమణతో తలో దిక్కుకు పరిగెడుతున్న జనం. ఎక్కడికి వెళుతున్నారో.. ఎలా బతుకుతారో తెలియదు. ముందు అక్కడి నుంచి బయట పడితే ప్రాణాలన్నా నిలుస్తాయన్న తలంపుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో జనం తోసుకుంటూ ఎక్కుతున్నారు. మరో మార్గం లేక రెక్కలపైన కూడా కూర్చున్నారు. విమానం గాల్లోకి ఎగరడంతో అంత ఎత్తు మీద నుంచి క్రింద పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
 
అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. 
Kabul
 
దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించగానే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. వాహనాలు ఎక్కేందుకు ప్రజలు ఎగబడినట్టు ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వేలాది మంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు. ప్రయాణికులను అదుపుచేయడానికి కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments