Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ పార్లమెంట్‌ దిగువ సభలోనూ ''మీ టూ''- ''A'' జోకులు.. బలవంతంగా ముద్దు..?

''మీ టూ'' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావించే బ్రిటన్ పార్లమెంటులో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తేలింది.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (11:29 IST)
''మీ టూ'' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావించే బ్రిటన్ పార్లమెంటులో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తేలింది. పలు రంగాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బట్టబయలు చేస్తున్న నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్(దిగువ సభ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నేత ఆండ్రియా లీడ్సమ్ విచారణకు ఆదేశించారు. 
 
ఇందులో భాగంగా మాజీ జడ్జీ డేమ్ లారా కాక్స్ జరిపిన విచారణలో సంచలనాత్మక విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులపై ప్రస్తుత, మాజీ ఎంపీలు వేధింపులకు పాల్పడ్డారని వెల్లడి అయ్యింది. లైంగిక వేధింపులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం, శరీర రూపు రేఖలపై కామెంట్లు చేయడం, బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, సెక్సు జోకులు వేయడం, అభ్యంతరకరంగా తాకడం, విసిగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. 
 
మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను తేల్చే యంత్రాంగం బ్రిటన్ పార్లమెంటులో కరువయిందని తెలిపారు. నిబంధనల మేరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డ చట్టసభ్యుల పేర్లను బయటపెట్టలేక పోతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 155 పేజీల నివేదికను లారా సభకు సమర్పించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం