Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి..అందుకు ఏం చేస్తున్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (09:19 IST)
ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనికి కారణం ఒంటెలు అధికంగా నీళ్లు తాగేస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒంటెలను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ దేశ అధికారులు హెలికాఫ్టర్లలో గాలిస్తూ కంటికి కనిపించిన ఒంటెను చంపేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే, కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాపర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments