ఉక్రెయిన్‌లో గుండెలు పగిలే మోతతో బాంబులు: ఇస్కీమిక్ స్ట్రోక్‌తో మరణించిన ఇండియన్ విద్యార్థి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:43 IST)
ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. రెండు రోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. ఉక్రెయిన్- రష్యా సైన్యం పరస్పర దాడులతో ఉక్రెయిన్ భూభాగం దద్దరిల్లుతోంది. ఈ యుద్ధం జరుగుతున్న తరుణంలో పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన భారతీయ విద్యార్థి బుధవారం మరణించాడు.

 
చందన్ జిందాల్ వయసు 22 ఏళ్లు. ఇతడు ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. వెంటనే అతడిని ఎమర్జెన్సీ హాస్పిటల్ విన్నిట్సియాలో చేర్పించారు. ఐతే అప్పటికే అతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

 
అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అతని తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకరోజు క్రితం ఖార్కివ్‌లోని షెల్లింగ్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతదేహాన్ని కూడా తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణీకుల సేవల కోసం ఉక్రెయిన్‌లోని గగనతలం మూసివేయబడినందున, భారతీయ విద్యార్థుల తరలింపు కోసం జరుగుతున్నట్లుగా మృతదేహాలను కూడా అలాగే  ఇతర దేశాల ద్వారా జరగవచ్చు. 

 
ఇస్కీమిక్ స్ట్రోక్‌ అంటే ఏంటి?
మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా అంతరాయం కలగడం లేదా తగ్గినప్పుడు, మెదడు కణజాలం ఆక్సిజన్- పోషకాలను పొందకుండా నిరోధించినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభిస్తాయి. స్ట్రోక్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, దీనికి సత్వర చికిత్స కీలకం. ఈ స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతింటుంది.

 
కాగా ఉక్రెయిన్ బాంబు మోతలకు, భయానక దృశ్యాల వల్ల పంజాబ్ విద్యార్థి భీతి చెంది ఇలా అయి వుండవచ్చునేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments