Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికలు ముగిశాక పెరగనున్న పెట్రోల్, సిలిండర్ ధరలు?

ఎన్నికలు ముగిశాక పెరగనున్న పెట్రోల్, సిలిండర్ ధరలు?
, బుధవారం, 2 మార్చి 2022 (15:31 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎఫెక్ట్‌తో పెట్రోల్ ధరలు పెరుగనున్నాయి. ఈనెల 10 తర్వాత ఏ క్షణమైనా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను చేపట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. 
 
లీటర్ పెట్రోల్ రూ.10-15 లోపు, లీటర్ డీజిల్ రూ.8-10 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని.. వాహనదారులు దీనికి సిద్ధంగా ఉండాలని జేపీ మోర్గాన్ సర్వే సంస్థ సూచించింది. ఈనెల 7న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత సామాన్యులపై పెరిగే పెట్రోల్ ధరలు షాకివ్వనున్నాయి. 
 
మరోవైపు చమురు కంపెనీలు ఇప్పటికే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయని గుర్తుచేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధరలను కూడా పెంచే అవకాశాలున్నాయని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచంపై కూర్చొన్నవారిపైకి దూసుకెళ్లిన వ్యాను...