Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాపై ఆంక్షలు.. చమురు ఎగుమతులకు చెక్.. అది జరిగితే?

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (10:18 IST)
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాశ్చాత్య దేశాల నుంచి అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో పుతిన్ సర్కారు ఆర్థికంగానూ కొంత ఇబ్బందులకు గురవుతోంది. 
 
తాజాగా అయితే ఈ వేడిని మరింతగా పెంచేందుకు ఈయూ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు ధరను ఒక్కో బ్యారెల్‌కు కేవలం 60 డాలర్లుగా నిర్ణయించేందుకు సిద్ధమైంది. 
 
క్రూడ్ ధరలను నియంత్రించడం యుద్ధాన్ని త్వరగా ముగించడంతో సాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరల పరిమితిని నిర్ణయించకపోతే రష్యాకు లాభదాయకంగా వుంటుందని తెలిపారు. 
 
ధరల పరిమితి నిర్ణయిస్తే మిత్రదేశమైన భారత్‌కు సరసమైన ధరలకే చమురు సరఫరా చేసే అవకాశం వుంది. అలా జరిగితే దేశంలోని ప్రజలపై ధరల భారం పెరగదు. 
 
ప్రస్తుతం రష్యా రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఈ ఆంక్షలు అమలులోకి వస్తే రష్యా తన చమురు ఎగుమతులు నిలిపివేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments